ప్రభుత్వ ఆస్తులమ్మి ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-11-19T01:30:20+05:30 IST
నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు జన జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
కర్నూలు: నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు జన జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో జగన్, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి పరిపాలన చేస్తున్నారు. ప్రజలను కేంద్ర ప్రభుత్వం లూటి చేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను అమ్మి పెట్రోల్, డీజల్ రేట్లను పెంచి ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు.’’ అని మండిపడ్డారు.