కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర వాయిదా

ABN , First Publish Date - 2021-11-14T02:22:49+05:30 IST

ప్రజా చైతన్య యాత్రలను కాంగ్రెస్ పార్టీ వాయిదా

కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర వాయిదా

హైదరాబాద్: ప్రజా చైతన్య యాత్రలను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలు, పాదయాత్రలను వాయిదా వేస్తున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పాదయాత్రలకు అనుమతులు ఇవ్వకపోవడంతో వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్యర్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు  కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర  చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-11-14T02:22:49+05:30 IST