ముస్లింల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ సిద్ధం: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-08-14T22:16:50+05:30 IST
మైనార్టీల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్
హైదరాబాద్: మైనార్టీల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా జరుగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. మైనార్టీల పక్షాన కాంగ్రెస్ పోరాటం ప్రారంభమయ్యిందని, కేసీఆర్ను గద్దె దించేవరకు పోరాటం ఆగదని ప్రకటించారు. కేసీఆర్ ముస్లింలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు లేకుండా పోయిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటేనని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.