Uttarakhand polls: రాంనగర్ బరిలో సీఎం హరీష్ రావత్
ABN , First Publish Date - 2022-01-25T14:55:53+05:30 IST
రామ్నగర్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం హరీశ్ రావత్ను పార్టీ బరిలోకి దింపింది....
గువహటి: రామ్నగర్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం హరీశ్ రావత్ను పార్టీ బరిలోకి దింపింది.ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.కాంగ్రెస్ ఇప్పటి వరకు మొత్తం 64 మంది అభ్యర్థులను విడుదల చేసింది.రాష్ట్రంలో పార్టీ ప్రచార సారథిగా ఉన్న హరీష్ రావత్ 2017 ఎన్నికల్లో హరిద్వార్-రూరల్, కిచ్చా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి విఫలమయ్యారు.లాన్స్డౌన్ అసెంబ్లీ స్థానం నుంచి అనుక్రితి గుసైన్ రావత్కు కూడా పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆమె శుక్రవారం బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన హరక్ సింగ్ రావత్ కోడలు.అయితే హరక్ సింగ్ రావత్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఇప్పటివరకు నిర్ణయించలేదు. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.
జాబితాలో ఇతర అభ్యర్థులు డెహ్రాడూన్ స్థానం నుంచి సూర్యకాంత్ ధస్మాన, దోయివాలా నుంచి మోహిత్ ఉనియాల్, రిషికేశ్ నుంచి జయేంద్ర చంద్ రమోలా, బర్ఖా రాణి, ఖాన్పూర్ నుంచి సుభాష్ చౌదరి, ఖాన్పూర్ నుంచి సుభాష్ సౌదరిలు ఉన్నారు. పార్టీ తన మొదటి జాబితాలో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్ను శ్రీనగర్ స్థానం నుంచి,అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ను చక్రతా నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపింది.బీజేపీని వీడి ఇటీవల కాంగ్రెస్లో చేరిన రాష్ట్ర అసెంబ్లీలో మాజీ స్పీకర్ యశ్పాల్ ఆర్య తన బాజ్పూర్-ఎస్సీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆర్య కుమారుడు సంజీవ్ ఆర్య కూడా టిక్కెట్ పొందారు.గతేడాది జూన్లో మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా హృదయేష్ కుమారుడు సుమిత్ హృదయేష్ హల్ద్వానీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు.