రేవంత్ రెడ్డికి ఊరట.. మూడు కేసులు కొట్టివేత
ABN , First Publish Date - 2021-10-26T03:20:18+05:30 IST
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఉన్న మూడు కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. మహబూబాబాద్,...
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఉన్న మూడు కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. మహబూబాబాద్, చిక్కడపల్లి, ఓయూ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు నమోదు అయ్యాయి. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారని రేవంత్పై స్థానిక పోలీసులు అభియోగం మోపారు. అయితే అభియోగాలకు తగిన ఆధారాలు లేకపోవడంతో రేవంత్ రెడ్డిపై మూడు కేసులను కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసుల్లో రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.