ధాన్యం కల్లాల్లోకి రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2021-11-19T03:00:18+05:30 IST
శుక్రవారం నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్ వెళ్లనుంది. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కల్లాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఆయా జిల్లాల్లో..
హైదరాబాద్: శుక్రవారం నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్ వెళ్లనుంది. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కల్లాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఆయా జిల్లాల్లో ధాన్యం కేంద్రాలకు సీనియర్ కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. చివరి ధాన్యం గింజ కొనేవరకు రైతుల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమైంది.