కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం బస్సుల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-05-23T19:28:19+05:30 IST

నల్లగొండ: నల్లగొండ నుంచి ఒరిస్సాకు వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం బస్సుల ఏర్పాటు

నల్లగొండ: నల్లగొండ నుంచి ఒరిస్సాకు వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను క్లాక్ టవర్ సెంటర్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. లాక్ డౌన్ పేరుతో వలస కార్మికులను గాలికి వదిలేశారని విమర్శించారు.


వాళ్లను సొంత ఊర్లకు పంపడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్నారు. వలస కూలీల సంక్షేమానికి ఒక్క కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని ఉత్తమ్ పేర్కొన్నారు. సోనియాగాంధీ సూచనతో రాష్ట్రంలోని వలస కార్మికులను సొంత ఊర్లకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసిందన్నారు. నల్లగొండ నుంచి ఒరిస్సా కార్మికులను తమ పార్టీ సొంత డబ్బుతో బస్సులో పంపించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపేందుకు కృషి చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-05-23T19:28:19+05:30 IST