వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయం : పటేల్‌

ABN , First Publish Date - 2021-10-18T05:41:02+05:30 IST

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్ర

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయం : పటేల్‌
సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ కార్యదర్శి రమేష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, అక్టోబరు 17: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు త్వరలోనే గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి అనుచరులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరాచకాలు, దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు దుర్మార్గమైన చర్య అన్నారు. సమావేశంలో కౌన్సిలర్‌ షఫిఉల్లా, వెలుగు వెంకన్న, నాయకులు గట్టు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:41:02+05:30 IST