చర్చలు ఫలప్రదం కాకూడదన్నది కాంగ్రెస్ భావన : జవదేకర్
ABN , First Publish Date - 2021-01-20T17:40:44+05:30 IST
ప్రభుత్వం, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు ముందుకు సాగకూడదన్న భావనతో కాంగ్రెస్ ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు.
న్యూఢిల్లీ : ప్రభుత్వం, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు ముందుకు సాగకూడదన్న భావనతో కాంగ్రెస్ ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు ఫలప్రదం కాకూడదని భావిస్తోందని, అందుకే ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు ఫలప్రదం కాకూడదని కాంగ్రెస్ అనేక కుటిల యత్నాలు చేస్తోంది. నిరసనలు చేపడుతూ అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా సరే... తాము చర్చలు జరుపుతూనే ఉంటాం. ఏదో ఒక దశలో చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయని మేం గట్టిగా నమ్ముతున్నాం.’’ అని ప్రకాశ్ జవేదకర్ ప్రకటించారు.