కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై కాంగ్రెస్ కార్యకర్తల కోడిగుడ్ల దాడి

ABN , First Publish Date - 2021-10-31T21:00:22+05:30 IST

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భుబనేశ్వర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు...

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై కాంగ్రెస్ కార్యకర్తల కోడిగుడ్ల దాడి

భుబనేశ్వర్: కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భుబనేశ్వర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు.


కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-10-31T21:00:22+05:30 IST