తెలంగాణ సాంస్కృతిని నిర్వీర్యం చేసే కుట్రలు చేశారు

ABN , First Publish Date - 2021-10-15T06:42:32+05:30 IST

తెలంగాణ సాంస్కృతి, సాంప్రాదాయాలు, బాష, యాశలను ఆంధ్ర పాలకులు నిర్వీర్యం చేసే కుట్రలు చేశారని రాష్ట్ర ప్రాణాళీక సంఘం ఉపాధ్యాక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

తెలంగాణ సాంస్కృతిని నిర్వీర్యం చేసే కుట్రలు చేశారు
సమావేశంలో మాట్లాడుతున్న బోయినపల్లి వినోద్‌కుమార్‌

 రాష్ట్ర ప్రాణాళీక సంఘం ఉపాధ్యాక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌

జమ్మికుంట, అక్టోబరు 14: తెలంగాణ సాంస్కృతి, సాంప్రాదాయాలు, బాష, యాశలను ఆంధ్ర పాలకులు నిర్వీర్యం చేసే కుట్రలు చేశారని రాష్ట్ర ప్రాణాళీక సంఘం ఉపాధ్యాక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్‌కుమార్‌ ఆద్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రానికి హజరైన వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పూర్వ కాలంలో వైభవంగా జరుపుకునే తెలంగాణ సాంస్కృతికి ప్రతిక అయిన బతుకమ్మకు ఆదరణ లేకుండా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలుపుకోని తెలంగాణ పండుగలు, సాంస్కృతిని కించపరిచే కార్యక్రమాలు చేపట్టారన్నారు. సినిమాల్లో కూడ గుండాలు, రౌడిలు, అక్షరాస్యత ఉండని వారికి మన బాష, యాశను చూపించే వారన్నారు. ఆ సందర్భంగా 2001లో పెట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ, గులాభి జెండా మన భాష, యాశ, సాంస్కృతి, సాంప్రాదాయాలు గర్వపడే విదంగా తీర్చిదిద్ది ఉధ్యమాన్ని ముందుకు తీసుకు వెల్లిన ఘణత ముఖ్యమంత్రి కేసిఆర్‌కు దక్కిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్‌ పొనగంటి మల్లయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పోడేటి రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-15T06:42:32+05:30 IST