విటుడిగా మారిన పోలీస్.. రూ. 500కు బేరం.. గదిలో అభ్యంతరకర స్థితిలో యువకుడు..క్షణాల్లో సీన్ మారిపోయింది!
ABN , First Publish Date - 2021-10-11T17:55:36+05:30 IST
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలోగల కుఠ్లాలో..
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలోగల కుఠ్లాలో జరుగుతున్న సెక్స్ రాకెట్కు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇక్కడ వ్యభిచార గృహం నడుపుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళలతో పాటు అభ్యంతరకర స్థితిలో ఉన్న ఒక యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సెక్స్ రాకెట్ గుట్టును బట్టబయలు చేసేందుకు పోలీసులు ఒక కానిస్టేబుల్ను విటునిగా.. వ్యభిచారం జరుగుతున్న ఇంటికి పంపించారు.
అతను రూ. 500కు ఒక మహిళతో బేరం కుదుర్చుకున్నాడు. తరువాత ఆ విషయాన్ని ఆ ఇంటి బయట కాపుకాస్తున్న పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసుల బృందం ఆ ఇంటిలోనికి ప్రవేశించి, వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ శివాజీ నగర్లో వ్యభిచారం జరుగుతున్నదని తమకు సమాచారం రావడంతో, వారిని పట్టుకునేందుకు ప్లానింగ్తో వెళ్లి, ఆ సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేశామని తెలిపారు.