గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-05T04:14:46+05:30 IST

మండలంలో శరభన్నపాలెం గ్రామానికి చెందిన విశాఖ గ్రేహౌండ్సు కానిస్టేబుల్‌ సోమెల మహేశ్‌(27) గురువారం మృతి చెందగా, శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

గాయపడిన కానిస్టేబుల్‌ మృతి
మృతి చెందిన కానిస్టేబుల్‌ మహేశ్‌(ఫైల్‌)


కొయ్యూరు, డిసెంబరు 4: మండలంలో శరభన్నపాలెం గ్రామానికి చెందిన   విశాఖ గ్రేహౌండ్సు కానిస్టేబుల్‌ సోమెల మహేశ్‌(27) గురువారం మృతి చెందగా, శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వారం క్రితం కొయ్యూరులో స్నేహితుడి వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో అనకాపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మహేశ్‌ తలకు బలమైన గాయం కావడంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మహేశ్‌కు తల్లి కాంతమ్మ, అన్నయ్య, అక్క, చెల్లి ఉన్నారు. మహేశ్‌పైనే కుటుంబం ఆధారపడి ఉంది. చెల్లికి ఇంకా వివాహం కాలేదు. మహేశ్‌ నేత్ర దానం చేయడంతో ఆయన మరణానంతరం మరో ఇద్దరికి చూపు ప్రసాదించాడు. 

Updated Date - 2020-12-05T04:14:46+05:30 IST