దొంగతనం కేసులో కానిస్టేబుల్ సస్పెండ్
ABN , First Publish Date - 2022-01-23T21:54:08+05:30 IST
దొంగతనం కేసులో చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ సురేష్ బాబును
చిత్తూరు: దొంగతనం కేసులో చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ సురేష్ బాబును డీఐజీ సెంథిల్ కుమార్ సస్పెండ్ చేశారు. నగదు దొంగిలించిందని పనిమనిషి ఉమామహేశ్వరిని పీఎస్లో పోలీసులు చితక్కొట్టారు. దర్యాప్తు సమయంలో తనతో దురుసుగా ప్రవర్తించారని పనిమనిషి వాపోయింది. జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్రెడ్డి ఇంట్లో ఉమా పనిమనిషిగా ఉంటోంది. సూపరింటెండెంట్ ఇంట్లో రూ.2 లక్షలు నగదు చోరీ చేసిందని పనిమనిషిపై ఆరోపణలు వచ్చాయి.
జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల రెడ్డి ఇంట్లో రెండు లక్షల నగదు మాయమయ్యాయి. అయితే దొంగతనం చేసిందనే నెపంతో పనిమనిషి ఉమా మహేశ్వరిని విచారణకు పిలిచి చిత్తూరు వన్టౌన్ పోలీసులు చితక బాదారు. దీంతో పనిమనిషి ఉమా మహేశ్వరి తీవ్ర గాయాలపాలైంది. అనంతరం దొంగతనంపై పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. దొంగతనం చేసింది ఉమా మహేశ్వరి కాదని తెలుసుకున్నారు. బాధితురాలిని పిలిచి తాము కొట్టి గాయపరచిన విషయాన్ని బయటకు చెప్పొద్దని బాధితురాలిని పోలీసులు బెదిరించారు.