నియోజక వర్గాల వారీగా సమీక్ష
ABN , First Publish Date - 2020-08-09T09:21:16+05:30 IST
తెలంగాణలో ఇకనుంచి ప్రతీవారం పార్టీకి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు...
- టీడీపీ-టీఎస్ ముఖ్య నేతలతో చంద్రబాబు
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇకనుంచి ప్రతీవారం పార్టీకి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం పార్టీ కోర్ కమిటీ, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో జూమ్ కాన్ఫరెన్సు ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా కమిటీలకు బదులు పార్లమెంటు నియోజకవర్గ కమిటీలను అన్నింటిని పూర్తి చేయడంపై ఆయన పార్టీ నేతలను అభినందించారు. సమావేశంలో టీడీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు, నేతలు అరవింద్గౌడ్, కొత్తకోట దయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.