భవన నిర్మాణ కార్మికుల క్లయిమ్లు సెటిల్ చేయాలి
ABN , First Publish Date - 2021-12-08T05:16:28+05:30 IST
మండలంలోని భవన నిర్మాణ కార్మికుల క్లయిమ్లను సెటిల్ చేయాలని సీటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
పరవాడ, డిసెంబరు 7: మండలంలోని భవన నిర్మాణ కార్మికుల క్లయిమ్లను సెటిల్ చేయాలని సీటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక మరిడిమాంబ కల్యాణ మండపంలో మంగళవారం సీటూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ప్రభుత్వం తీసుకున్న రూ.430 కోట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డును ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, దానిని కార్మికులు తిప్పి కొట్టాలని కోరారు. కాగా ఈ- శ్రమ పోర్టల్లో కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కార్మిక శాఖాధికారులు హరిబాబు, సత్యనారాయణ కోరారు. ఈ సమావేశంలో సీటూ జిల్లా కోశాధికారి వీవీ శ్రీనివాసరావు, భవన కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గెడ్డం రమణ, సీహెచ్ రాంబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.