Secunderabad లోని పాస్‌పోర్టు ఆఫీసుకు యూఏఈ కాన్సుల్‌ జనరల్‌

ABN , First Publish Date - 2021-12-23T13:21:41+05:30 IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కాన్సుల్‌ జనరల్‌ ఆరిఫ్‌ అలీ అలీ ముహమ్మద్‌ అల్‌-తబూర్‌ అల్‌-న్యూమి బుధవారం సికింద్రాబాద్‌లోని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించారు.

Secunderabad లోని పాస్‌పోర్టు ఆఫీసుకు యూఏఈ కాన్సుల్‌ జనరల్‌

సికింద్రాబాద్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కాన్సుల్‌ జనరల్‌ ఆరిఫ్‌ అలీ అలీ ముహమ్మద్‌ అల్‌-తబూర్‌ అల్‌-న్యూమి బుధవారం సికింద్రాబాద్‌లోని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి, ఎంఈఏ బ్రాంచి సెక్రటేరియట్‌ అధిపతి దాసరి బాలయ్యతో ఆయన సమావేశమయ్యారు. యూఏఈ-తెలంగాణ మధ్య ఆయా రంగాల్లో అభివృద్ధి కోసం పరస్పరం చేపట్టవలసిన చర్యలపై వారు చర్చించారు. ఈ సమావేశంలో ఎంఈఏ బ్రాంచి సెక్రటేరియట్‌ డిప్యూటీ సెక్రటరీ బి.శ్రీనివాసులు, సెక్షన్‌ ఆఫీసర్‌ విక్రమ్‌సింగ్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-23T13:21:41+05:30 IST