డివైడర్ను ఢీకొన్న కంటైనర్
ABN , First Publish Date - 2020-12-01T06:15:21+05:30 IST
మండలంలోని సికింద్రాపూర్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం కంటైనర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో డ్రైవర్ గుల్లాభాయ్ పఠాన్ (45) మృతిచెందినట్టు ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
బోల్తాపడిన వాహనం
డ్రైవర్ మృతి
జక్రాన్పల్లి, నవంబరు 30: మండలంలోని సికింద్రాపూర్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం కంటైనర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో డ్రైవర్ గుల్లాభాయ్ పఠాన్ (45) మృతిచెందినట్టు ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు నాగాలాండ్కు చెందిన కంటైనర్ చెన్నై నుంచి నాగ్పూర్కు టైర్ల లోడ్తో వెళ్తుండగా, సికింద్రాపూర్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొని, జాతీయ రహదారిపై అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గుల్లాభాయ్ పఠాన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన సోమవారం సాయంత్రం మృతిచెందినట్టు ఎస్ఐ తెలిపారు. బోల్తాపడిన కంటైనర్ను పోలీసులు తొలగింపజేశారు.