కంటైనర్‌ బోల్తా : వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-07-30T04:47:53+05:30 IST

మండలంలోని కడప-చెన్నై రహదారి చాముండేశ్వరిపేట వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్‌ డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కంటైనర్‌ బోల్తా పడింది.

కంటైనర్‌ బోల్తా  : వ్యక్తి మృతి
రోడ్డుపై బోల్తా పడిన కంటైనర్‌

సిద్దవటం, జూలై 29 : మండలంలోని కడప-చెన్నై రహదారి చాముండేశ్వరిపేట వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్‌ డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కంటైనర్‌ బోల్తా పడింది. రోడ్డుపై వెళుతున్న డి.బాలగంగాధర్‌రెడ్డి (35)పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలియజేశారు. 

Updated Date - 2021-07-30T04:47:53+05:30 IST