మద్యం దుకాణాలపై నిరంతర నిఘా
ABN , First Publish Date - 2020-04-09T10:08:00+05:30 IST
లాక్డౌన్ అమలు నేపథ్యంలో మద్యం దుకాణాలపై నిరంతరం నిఘా ఉంచామని కాకినాడ ప్రొహిబిషన్
కాకినాడ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ అమలు నేపథ్యంలో మద్యం దుకాణాలపై నిరంతరం నిఘా ఉంచామని కాకినాడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.ఏసుదాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. షాపులు మూసివేసినప్పటి నుంచి కాకినాడ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో 22 మండలాల్లో 7 ఎక్సైజ్ పోలీ్సస్టేషన్ల పరిధిలో 18 బార్లు, 185 ప్రభుత్వ మద్యం దుకాణాలపై నిరంతరం సిబ్బంది నిఘా ఉంచారన్నారు. తనిఖీల్లో భాగంగా ఆయా దుకాణాల్లో సరుకు వ్యత్యాసం గమనించి దానికి సంబంధించిన నగదు రికవరీ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. లాక్డౌన్ సమయంలో ఎక్కడైనా అనధికారికంగా మద్యం విక్రయాలు జరిగితే తమ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబరు 0884 237 3374కు ఫోన్ చేసి చెప్పాలన్నారు.