కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి
ABN , First Publish Date - 2021-08-02T04:56:22+05:30 IST
జిల్లా వైద్య విధాన పరిషత్, జీజీ హెచ్లలో ఎన్నోఏళ్ల నుంచి పని చేస్తున్న సుమారు 350 మంది కాంట్రా క్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర సహా ధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనా యుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంలు కోరారు.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ గుజరాతీపేట: జిల్లా వైద్య విధాన పరిషత్, జీజీ హెచ్లలో ఎన్నోఏళ్ల నుంచి పని చేస్తున్న సుమారు 350 మంది కాంట్రా క్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర సహా ధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనా యుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంలు కోరారు. ఆదివారం స్థానిక ఏపీఎన్జీవో హోమ్లో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంట్రాక్టు స్టాఫ్ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.