పొలం తనఖా పెట్టి కార్మికులకు జీతాలు
ABN , First Publish Date - 2022-01-21T05:16:27+05:30 IST
పొలం తనఖా పెట్టి పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు జీతాలిచ్చాడు ఓ కాంట్రాక్టర్.. ప్రభుత్వం నుంచి బిల్లు మంజూరు కాకపోవడంతో మూడు నెలల నుంచి కాకినాడ జీజీహెచ్లో పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు జీతాలు అందడం లేదు.
కాంట్రాక్టర్కు సత్కారం
జీజీహెచ్(కాకినాడ),
జనవరి 20: పొలం తనఖా పెట్టి పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు
జీతాలిచ్చాడు ఓ కాంట్రాక్టర్.. ప్రభుత్వం నుంచి బిల్లు మంజూరు కాకపోవడంతో
మూడు నెలల నుంచి కాకినాడ జీజీహెచ్లో పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ
గార్డులకు జీతాలు అందడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ లోపు
పండుగ వచ్చేసింది. తన దగ్గర పనిచేస్తున్న కార్మికులు పండుగ పూట డబ్బులు లేక
ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ గోకేడ రాంబాబు,
జీతాలిచ్చేందుకు ముందుకు వచ్చాడు. తన పొలాన్ని తాకట్టు పెట్టి సుమారు రూ.2
కోట్లు సమకూర్చి 240 మంది పారిశుధ్య కార్మికులు, 183 మంది సెక్యూరిటీ
సిబ్బందికి మూడు నెలల జీతాలు ఇచ్చేశాడు. దీంతో కార్మికుల ఆనందానికి
అవధుల్లేవు. కృతజ్ఞతగా కార్మికులు, సెక్యూరిటీ గార్డులు కలిసి గురువారం
కాంట్రాక్టర్ గోకేడ రాంబాబు, రూపలతాదేవి దంపతులను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు విజయకుమార్, రాయుడు రమేష్, వాసు,
శేషు, బాబ్జి, లోకేష్, మోహన్ పాల్గొన్నారు.