గ్రామాభివృద్ధికి తోడ్పడాలి
ABN , First Publish Date - 2021-01-21T06:26:41+05:30 IST
గ్రామాభివృద్ధిలో అందరూ తోడ్పడాలని జిల్లా అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే అన్నారు.
అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే
మామడ, జనవరి 20 : గ్రామాభివృద్ధిలో అందరూ తోడ్పడాలని జిల్లా అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే అన్నారు. బుధవారం రోజున మండ లంలోని బండల ఖానాపూర్, రాయదారి గ్రామాల్లో జరుగుతున్న క్రిమిటోరియా, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాభివృద్ధిలో అలసత్వం వహిస్తే చర్య లు తప్పవని, ధాన్యం ఆరబెట్టడానికి కల్లాలను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఎంపీడీవో రమేష్, సర్పంచ్ హరిప్రియ, ఏఈ ఉమా శంకర్, తదితరులు పాల్గొన్నారు.