సింగరేణి అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-02-07T09:55:50+05:30 IST

భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు.

సింగరేణి అభివృద్ధికి కృషి

భూపాలపల్లి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌

 భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం సింగరేణి డైరెక్టర్‌ భాస్కర్‌రావు, జీఎం నిరీక్షణ్‌రాజ్‌ మర్యాదపూర్వకం గా కలిశారు. సింగరేణి కోల్‌మైన్‌ మె మోంటోను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, రవాణ సౌకర్యాల గురించి సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ను జిల్లా ల్యాండ్‌ సర్వే అధికారి సుదర్శన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ ల్యాండ్‌ సర్వేయర్ల వివరాలు తదితవంటివి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ల్యాండ్‌ సర్వే అధికారి రాములు, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-02-07T09:55:50+05:30 IST