లెటర్‌ ఆర్టిస్ట్‌ సంఘం అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-06-02T10:13:25+05:30 IST

లెటర్‌ ఆర్టిస్ట్‌ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎన్‌.పార్థసారథి తెలిపారు.

లెటర్‌ ఆర్టిస్ట్‌ సంఘం అభివృద్ధికి కృషి

విజయనగరం రూరల్‌, జూన్‌ 1:  లెటర్‌ ఆర్టిస్ట్‌ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎన్‌.పార్థసారథి తెలిపారు. నగరంలోని సంఘ కార్యాలయంలో సోమవారం విస్తృతస్థాయి సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లెటర్‌ ఆర్టిస్ట్‌లకు త్వరలో సంఘం తరఫున గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.  ఆర్టిస్ట్‌ల్లో  పేదల ను ఆదుకోవాలన్నారు. ఇదిలా ఉండగా విజయనగరం లెటర్‌ ఆర్టిస్ట్‌లకు ఎస్పీ రాజకుమారి అందిం చిన ప్రశంసాపత్రాలను టూటౌన్‌ సీఐ శ్రీహరిరాజు అందజేశారు.  నగరంలోని పది ప్రధాన కూడళ్లలో వేసిన బొమ్మలతో ప్రజలకు కరోనాపై  అవగాహన కల్పించేందుకు గాను ఎస్పీ ఈ పత్రా లు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో లెటర్‌ ఆర్టిస్ట్‌ సంఘం ప్రతినిధులు బ్రహ్మాజీ,  ప్రభాకరరావు, రవికుమార్‌,  మాజీ కౌన్సిలర్‌ రాజేష్‌  తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-02T10:13:25+05:30 IST