అమెరికా కోర్టులో దోషి ఆత్మహత్య!
ABN , First Publish Date - 2021-05-19T07:55:26+05:30 IST
అమెరికాలో కోర్టు సాక్షిగా ఓ దోషి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదునైన ఓ ప్లాస్టిక్ పరికరంతో గొంతు కోసుకున్నాడు. నార్త్ డకోటాలోని ఫార్గోలో ఈ ఘటన జరిగింది
ఫార్గో, మే 18: అమెరికాలో కోర్టు సాక్షిగా ఓ దోషి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదునైన ఓ ప్లాస్టిక్ పరికరంతో గొంతు కోసుకున్నాడు. నార్త్ డకోటాలోని ఫార్గోలో ఈ ఘటన జరిగింది. విచారణ అనంతరం ముద్దాయిని దోషిగా నిర్ధారించిన అనంతరం కోర్టు నుంచి న్యాయనిపుణులు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఉగ్రవాద కార్యకలాపానికి సంబంధించిన ఓ కేసులో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించినట్లు సమాచారం.