ఏపీలో తారాస్థాయికి చేరిన కోడిపందాలు

ABN , First Publish Date - 2021-01-14T21:34:08+05:30 IST

ఏపీలో కోడిపందాలు తారాస్థాయికి చేరాయి. కృష్ణాజిల్లాలో జోరుగా కోడి పందాలు, బెట్టింగ్స్ పెడుతున్నారు.

ఏపీలో తారాస్థాయికి చేరిన కోడిపందాలు

విజయవాడ: ఏపీలో కోడిపందాలు తారాస్థాయికి చేరాయి. కృష్ణాజిల్లాలో జోరుగా కోడి పందాలు, బెట్టింగ్స్ పెడుతున్నారు. శిబిరాల దగ్గర ప్రత్యేక బందోబస్తును కోడిపందాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. కోడిపందాలతో పాటు కోత ముక్కాట, గుండాట, జూదం, లోపల-బయట జరుగుతున్నాయి. గతంలో తూర్పు కృష్ణాకే పరిమితమైన కోడి పందాల శిబిరాలు.. ఈ ఏడాది పశ్చిమ కృష్ణాలోనూ శిబిరాలు ఏర్పాటు చేశారు. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతుల మారుతున్నాయి. కోడి పందేలపై పోలీసులు ఉక్కుపాదం మోపినా.. పందేల జోరు మాత్రం తగ్గలేదు. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు కావడంతో పోలీసులు కూడా చూసీచూడనట్టే వ్యవహరించారు. ఒక్క భోగి రోజే రూ.కోట్లలో పందేలు జరగ్గా, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.  జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, కైకలూరు, కలిదిండి, పెడన, మచిలీపట్నం, నూజివీడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో భారీగా బరులు ఏర్పడ్డాయి. 


Updated Date - 2021-01-14T21:34:08+05:30 IST