Delhi: నేటినుంచి సబ్సిడీ‌యేతర వంటగ్యాస్ సిలిండరు ధర పెంపు

ABN , First Publish Date - 2021-09-01T15:57:34+05:30 IST

దేశంలో లక్షలాది గృహాలపై ప్రభావం చూపించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు బుధవారం నుంచి పెరిగాయి....

Delhi: నేటినుంచి సబ్సిడీ‌యేతర వంటగ్యాస్ సిలిండరు ధర పెంపు

న్యూఢిల్లీ : దేశంలో లక్షలాది గృహాలపై ప్రభావం చూపించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు బుధవారం నుంచి పెరిగాయి.బుధవారం నుంచి సబ్సిడీ‌యేతర వంటగ్యాస్ సిలిండరు ధర 25రూపాయలు పెంచినట్లు ఐఓసీఎల్ ప్రకటించింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 75 రూపాయలు పెంచారు.14.2 కిలోల సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రూ.884.50 కు పెరిగింది. సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండరు ధర ఈ ఏడాది జులై 1వతేదీన రూ.25.50 కు, ఆగస్టు 17 నుంచి మరో రూ.25లు పెంచారు.2014 మార్చి 1వతేదీన రూ.410.50 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రెట్టింపు అయింది.


అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ,రూపాయి-డాలర్ మారకం రేట్ల ద్వారా దేశంలో ఎల్పీజీ ధరలు నిర్ణయిస్తున్నారు.14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.859.50, కోల్‌కతాలో రూ.886.50,ముంబై నగరంలో రూ.859.50, చెన్నైలో రూ.875.50లుగా ఉందని ఐఓసీఎల్ వెల్లడించింది.25 రూపాయల పెంపుతో దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా బుధవారం నుంచి వివిధ నగరాల్లో పెరుగుతోంది.


Updated Date - 2021-09-01T15:57:34+05:30 IST