విద్యుదాఘాతంతో కూలీ మృతి

ABN , First Publish Date - 2021-03-04T05:35:00+05:30 IST

విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందిన ఘటన దూబచర్లలో జరిగింది. ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బిక్కిన ప్రసాద్‌(33) దూబచర్ల రెవెన్యూ పరిధిలో ఇమ్మండి రామారావు తోటలోకి కూలి పనికి బుధవారం వెళ్లాడు.

విద్యుదాఘాతంతో కూలీ మృతి

నల్లజర్ల, మార్చి 3 : విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందిన ఘటన దూబచర్లలో జరిగింది. ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బిక్కిన ప్రసాద్‌(33) దూబచర్ల రెవెన్యూ పరిధిలో ఇమ్మండి రామారావు తోటలోకి కూలి పనికి బుధవారం వెళ్లాడు. ఈ నేపథ్యంలో పామాయిల్‌ తోటలో గెలలు కోస్తున్న తరుణంలో ఇనుప గెడ ప్రమాదవశాత్తు 33కేవీ విద్యుత్‌ తీగెలకు తగలడంతో షాక్‌ తగిలి కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-03-04T05:35:00+05:30 IST