కంటైనర్లలో బయలుదేరిన కూలీలు.. అడ్డుకున్నపోలీసులు

ABN , First Publish Date - 2020-03-27T15:37:07+05:30 IST

హరియాణాకు చెందిన 150 మంది కూలీలు హైదరాబాద్ నుంచి రెండు కంటైనర్లలో బయలుదేరారు.

కంటైనర్లలో బయలుదేరిన కూలీలు.. అడ్డుకున్నపోలీసులు

ఆదిలాబాద్‌: హరియాణాకు చెందిన 150 మంది కూలీలు హైదరాబాద్ నుంచి రెండు కంటైనర్లలో బయలుదేరారు. అయితే వారిని ఆదిలాబాద్‌ పోలీసులు మహారాష్ట్ర సరిహద్దులో అడ్డుకున్నారు. పని దొరకడం లేదని, తిండి కూడా లేదని వాపోయారు. తమను స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కూలీలు పోలీసులను వేడుకున్నారు. అయినా పోలీసులు వారిని తిరిగి హైదరాబాద్‌కు పంపించారు.

Updated Date - 2020-03-27T15:37:07+05:30 IST