సీఎం జగన్కు వ్యతిరేకంగా పోస్టు...బ్యాంకు ఏజీఎంపై వేటు
ABN , First Publish Date - 2020-06-05T16:44:33+05:30 IST
సీఎం జగన్కు వ్యతిరేకంగా పోస్టు...బ్యాంకు ఏజీఎంపై వేటు
గుంటూరు: సీఎం జగన్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఒకరిపై వేటు పడింది. సీఎం జగన్కు వ్యతిరేకంగా పోస్టు చేశారనే కారణంతో జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏజీఎంపై పాలకవర్గం వేటు వేసింది. గతంలో పారసిటమాల్, బ్లీచింగ్ పౌడర్తో కరోనాను నివారించవచ్చని జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్పట్లో జగన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే జగన్ కామెంట్స్ను కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏజీఎం పిల్లలు ఆమె వాట్సప్ నుంచి ఫేస్బుక్లోకి షేర్ చేశారు. దీంతో సీఐడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యాంక్ పాలకవర్గం ఏజీఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.