ఎల్లుండి నుంచి కాఫర్ డ్యాం గ్యాప్ పనులు
ABN , First Publish Date - 2021-04-13T09:45:04+05:30 IST
ఎల్లుండి నుంచి కాఫర్ డ్యాం గ్యాప్ పనులు
గోదావరి జలాల విడుదల బంద్
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాఫర్ డ్యాం పనులను ఈ నెల 15 నుంచి వేగవంతం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల్లో గ్యాప్లను మూసేయాలని నిశ్చయించింది. దీంతో.. గోదావరి జలాలను కిందకు వదలకుండా నిలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వేసిన పంటలకు నీళ్లందించేందుకు వీలుగా మరికొంత కాలం ఆగాలని వ్యవసాయ శాఖ కోరుతుండగా.. వేసవి దృష్ట్యా పంటలకు సాగు నీరందించాలని రైతులు కోరుతున్నారు.