పెళ్లి వాహనంలో వచ్చి.. దిమ్మదిరిగే షాకిచ్చిన పోలీసులు

ABN , First Publish Date - 2020-03-08T20:22:50+05:30 IST

మహారాష్ట్రలోని ఓ నదీతీరంలో కొంతమంది తవ్వకాలు జరుపుతున్నారు. ఇంతలో అక్కడకు ఓ వాహనం వచ్చింది.

పెళ్లి వాహనంలో వచ్చి.. దిమ్మదిరిగే షాకిచ్చిన పోలీసులు

ముంబై: మహారాష్ట్రలోని ఓ నదీతీరంలో కొంతమంది తవ్వకాలు జరుపుతున్నారు. ఇంతలో అక్కడకు ఓ వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని సాధారణంగా పెళ్లిళ్లలో ఉపయోగిస్తారు. అలాంటి వాహనం ఇక్కడికెందుకొచ్చింది? అని చూస్తున్న అక్కడి వారి కళ్ల ముందే దానిలోంచి పోలీసులు దిగారు. దిగీ దిగడంతోనే అక్కడ ఉన్న వారిపై విరుకుచుపడ్డారు. అక్కడున్న 12 టిప్పర్ లారీలను, ఎనిమిది క్రేన్లను సీజ్ చేశారు. వీటి విలువ రూ.3.6కోట్లు ఉంటుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం ప్రకటించారు. ఇదంతా భాంద్రా ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డగించడానికే చేసినట్లు తెలిపారు. నిందితులకు అనుమానం రాకుండా ఉండేందుకే పోలీసులు.. పెళ్లిళ్లకు ఉపయోగించే వాహనాల్లో మైనింగ్ జరుగుతున్న ప్రాంతంపై రెయిడ్ చేశారని, అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నారని ఉన్నతాధికారులు చెప్పారు. 

Updated Date - 2020-03-08T20:22:50+05:30 IST