అసాంఘిక శక్తులపై నిఘా కోసమే కార్డన్సెర్చ్
ABN , First Publish Date - 2021-04-10T06:41:36+05:30 IST
అసాంఘిక శక్తులపై నిఘా కొనసాగించడానికే కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ కారే కిరణ్ప్రభాకర్ తెలిపారు.
భైంసా క్రైం, ఏప్రిల్ 9 : అసాంఘిక శక్తులపై నిఘా కొనసాగించడానికే కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ కారే కిరణ్ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని భట్టిగల్లీలో కార్డెన్సెర్చ్ నిర్వహించారు. ఉదయం నుంచి పోలీస్ బల గాలు ఆ కాలనీల్లో మోహరించారు. ప్రతీ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ద్విచక్ర వాహనపత్రాలను, ఆధార్కార్డును పరిశీలించారు. అనంతరం భట్టిగల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల సంక్షేమం, రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు సాగించే అవకాశం లేకుండా నిఘా ఏర్పాటు చేసి గట్టిచర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఏవైనా వీడియోలు వైరల్ చేస్తే గ్రూప్ అడ్మిన్, పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరంగా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఐటీ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్డెన్సెర్చ్లో పట్టణ సీఐ వేణుగోపాల్రావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.