కోరమాండల్‌ లాభం రూ.338 కోట్లు

ABN , First Publish Date - 2021-07-27T05:54:30+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన

కోరమాండల్‌ లాభం రూ.338 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ రూ.338 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.251 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం కూడా 14 శాతం వృద్ధితో రూ.3,224 కోట్ల నుంచి రూ.3,686 కోట్లకు చేరినట్లు సంస్థ ఎండీ సమీర్‌ గోయెల్‌ తెలిపారు. త్రైమాసిక కాలంలో పంటల సస్య రక్షణ విభాగంలో కంపెనీ కొత్తగా ఆరు ఉత్పత్తులను విడుదల చేసింది. 

Updated Date - 2021-07-27T05:54:30+05:30 IST