కూకట్పల్లిలో 224 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-20T07:04:58+05:30 IST
కూకట్పల్లి ప్రాంతంలో సోమవారం 632 కరోనా పరీక్షలు నిర్వహించగా 224 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
కూకట్పల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): కూకట్పల్లి ప్రాంతంలో సోమవారం 632 కరోనా పరీక్షలు నిర్వహించగా 224 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కూకట్పల్లి పీహెచ్సీ పరిధిలో 115 మందిలో 46, హస్మత్పేటలో 91 మందిలో 53, జగద్గిరిగుట్టలో 70 మందిలో 20, బాలానగర్లో 199 మందిలో 74, పర్వత్నగర్లో 75 మందిలో 11, మూసాపేటలో 82 మందిలో 20 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.
శేరిలింగంపల్లిలో 139..
చందానగర్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సోమవారం 675 కరోనా పరీక్షలు నిర్వహించగా 139మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని వైద్యాధికారి రామిరెడ్డి తెలిపారు. రాయదుర్గం అర్బన్ పీహెచ్సీలో 106 మందిలో 17, హఫీజ్పేటలో 168 మందిలో 24, శేరిలింగంపల్లిలో 401 మందిలో 98మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్లో 173..
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో సోమవారం 607 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 173 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్ యూపీహెచ్సీలో 134 మందిలో 24, గాజులరామారంలో 84 మందిలో 14, సూరారంలో 79 మందిలో 23, దుండిగల్ పీహెచ్సీలో 130 మందిలో 51, శ్రీకృష్ణానగర్ బస్తీ దవాఖానలో 50 మందిలో 18, రంగారెడ్డినగర్లో 25 మందిలో 8, జీడిమెట్లలో 67 మందిలో 21, అంబేడ్కర్నగర్లో 38 మందిలో 14 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయా కేంద్రాల వైద్యాధికారులు తెలిపారు.