కూకట్పల్లిలో 78 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-09T06:27:46+05:30 IST
కూకట్పల్లి ప్రాంతంలో శనివారం 302మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 78 మందికి పాజిటివ్ వచ్చింది. కూకట్పల్లి పీహెచ్సీ పరిధిలో 74 మందిలో 16, జగద్గిరిగుట్ట(హనుమాన్నగర్)లో
కూకట్పల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): కూకట్పల్లి ప్రాంతంలో శనివారం 302మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 78 మందికి పాజిటివ్ వచ్చింది. కూకట్పల్లి పీహెచ్సీ పరిధిలో 74 మందిలో 16, జగద్గిరిగుట్ట(హనుమాన్నగర్)లో 41 మందిలో 11, బాలానగర్లో 75 మందిలో 26, పర్వత్నగర్లో 40 మందిలో 9, మూసాపేటలో 30 మందిలో 4, ఎల్లమ్మబండలో 42 మందిలో 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.
కుత్బుల్లాపూర్లో 39..
కుత్బుల్లాపూర్, మే 9 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో శనివారం 221 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 39 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. కుత్బుల్లాపూర్ యూపీహెచ్సీలో 69 మందిలో 10, గాజులరామారం యూపీహెచ్సీలో 50 మందిలో 15, సూరారం యూపీహెచ్సీలో 36 మందిలో 5, దుండిగల్ పీహెచ్సీలో 66 మందిలో 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయా కేంద్రాల వైద్యాధికారులు తెలిపారు.