కూకట్‌పల్లిలో 47 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-10T06:01:19+05:30 IST

కూకట్‌పల్లి ప్రాంతంలో ఆదివారం 253 కరోనా పరీక్షలు నిర్వహించగా 47 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ

కూకట్‌పల్లిలో 47 కరోనా కేసులు

కూకట్‌పల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి ప్రాంతంలో ఆదివారం 253 కరోనా పరీక్షలు నిర్వహించగా 47 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 70 మందిలో 6, జగద్గిరిగుట్ట(హనుమాన్‌నగర్‌)లో 40 మందిలో 16, బాలానగర్‌లో 52 మందిలో 12, మూసాపేటలో 30 మందిలో 1, ఎల్లమ్మబండలో 36 మందిలో 4, హస్మత్‌పేటలో 25 మందిలో 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 


కుత్బుల్లాపూర్‌లో 30..

కుత్బుల్లాపూర్‌, మే 9 (ఆంధ్ర జ్యోతి): కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఆదివారం 169 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 78 మందిలో 19, గాజులరామారంలో 49 మందిలో 7, దుండిగల్‌ పీహెచ్‌సీలో 35 మందిలో 4, సూరారం యూపీహెచ్‌సీలో ఏడుగురికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు ఆయా కేంద్రాల వైద్యాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-05-10T06:01:19+05:30 IST