262 కరోనా కేసులు.. 10 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-11T05:52:04+05:30 IST

262 కరోనా కేసులు.. 10 మంది మృతి

262 కరోనా కేసులు.. 10 మంది మృతి

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, మే 10: జిల్లాలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 812 మందికి పరీక్షలు నిర్వహించగా 262 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో ఏకంగా పది మంది మృతిచెందారు. కాగా, రెండోడోస్‌ వ్యాక్సిన్‌ 1,558 మందికి వేశారు. పీహెచ్‌సీల వారీగా కేసుల నమోదు ఇలా ఉంది. నర్సంపేట, పర్వతగిరిలో 23 చొప్పున, ఆత్మకూరులో 27, కేశవాపూర్‌లో 17, దామెర, రాయపర్తిలో 16 చొప్పున, వర్ధన్నపేట, మేపడల్లి, నెక్కొండలో 15 చొప్పున, ఖానాపూర్‌, అలంకానిపేటలో 14 చొప్పున, శాయంపేట, పరకాల, సంగెంలో 12 చొప్పున, నల్లబెల్లిలో తొమ్మిది, చెన్నారావుపేటలో ఎనిమిది, దుగ్గొండిలో ఆరు, బానోజీపేటలో నాలుగు, గీసుగొండలో  మూడు, నడికూడలో ఒకటి నమోదయ్యాయి. అలాగే, ఆత్మకూరులో ముగ్గరు, సంగెం, నల్లబెల్లిలో కేశవాపూర్‌, మేడపల్లి, బానోజీపేటలో ఒకరు చొప్పున, దామెరలో ఇద్దరు కలిపి మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు.


Updated Date - 2021-05-11T05:52:04+05:30 IST