కరోనాలో అప్రమత్తత అనివార్యం

ABN , First Publish Date - 2020-05-28T09:42:47+05:30 IST

కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటి స్తూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే

కరోనాలో అప్రమత్తత అనివార్యం

వైరా, మే27: కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటి స్తూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య ఆర్థికసహకారంతో ఆయన ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్‌యార్డులో పలువురు పేదలకు ఎమ్మెల్యే నిత్యావసర సరు కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మా ర్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, వైస్‌చైర్మన్‌ భద్రరాజు, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, 9వ వార్డు కౌన్సిలర్‌ సూర్యదేవర వింధ్యారాణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, ఎస్‌ఐ వి.సురేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చింతనిప్పు మురళీ, మిట్టపల్లి నాగి, ధార్న రాజశేఖర్‌, చల్లా సతీష్‌, జవ్వాజి కృష్ణయ్య, బీబా, కార్తీక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T09:42:47+05:30 IST