పల్లెలకూ పాకుతున్న కరోనా
ABN , First Publish Date - 2020-06-02T10:00:27+05:30 IST
మహమ్మారి కరోనా మెల్లమెల్లగా చాపకిందనీరులా పల్లెలకు పాకుతోంది.
దొరవారిసత్రం, జూన్ 1 : మహమ్మారి కరోనా మెల్లమెల్లగా చాపకిందనీరులా పల్లెలకు పాకుతోంది. పట్టణాలతో లింకులున్న పల్లె జనాల ద్వారా పల్లెలకు విస్తరిస్తోంది. దాంతో గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. మండలంలో కల్లూరు గ్రామంలో కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన ఓ యువరైతుకు కరోనా సోకింది. దాంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్గా జోన్గా ప్రకటించారు. ఆ గ్రామంలోని మరో 18 మందిని కూడా క్వారంటైన్ సెంటర్కు తరలించారు. దాంతో జనం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
డీవీసత్రంలో రెండో కేసు నమోదు
దొరవారిసత్రంలో రెండో పాజిటివ్ రెండో కేసు నమోదైంది. మండల కేంద్రంలోని ఓ కాలనీలో 8 ఏళ్ల బాలికకు కరోనా సోకింది. బాలిక కుటుంబం వారం క్రితం చెన్నై నుంచి వచ్చింది. స్థానికుల సమాచారంతో అధికారులు ముగ్గురు పెద్దలు, 8 ఏళ్ల బాలికను క్వారంటైన్లో ఉంచారు. బాలికకు కరోనా పాజిటి వచ్చింది. బాలికను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.