ములుగు జిల్లాలో ముగ్గురికి కరోనా
ABN , First Publish Date - 2021-01-21T04:16:43+05:30 IST
ములుగు జిల్లాలో ముగ్గురికి కరోనా
ములుగు, జనవరి 20: ములుగు జిల్లాలో కొత్తగా మరో ముగ్గురు కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం 190 మందికి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా, ములుగు మండలంలో ఇద్దరికి, గోవిందరావుపేట మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 5194కు పెరిగింది.