టీమిండియా సహాయ సిబ్బందిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-10-28T09:10:30+05:30 IST

భారత జట్టు సహాయ సిబ్బందిలో కరోనా కలకలం రేగింది. త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ రఘుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి

టీమిండియా సహాయ సిబ్బందిలో కరోనా కలకలం

న్యూఢిల్లీ: భారత జట్టు సహాయ సిబ్బందిలో కరోనా కలకలం రేగింది. త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ రఘుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడు వైదొలగినట్టు బీసీసీఐ తెలిపింది. ఇటీవల దుబాయ్‌ చేరిన భారత జట్టు సహాయ బృందంలో రఘు లేని విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌ పయనమయ్యే ముందు సహాయ సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా రఘుకు పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ వివరించింది. టెస్టు క్రికెటర్లు పుజార, విహారి మినహా మిగిలిన ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఆడుతుండడంతో రఘు గైర్హాజరీ పెద్ద సమస్య కాబోదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.

Updated Date - 2020-10-28T09:10:30+05:30 IST