తెలంగాణ జైళ్లలో ఖైదీల ములాఖత్లు నిలిపివేత
ABN , First Publish Date - 2022-01-19T04:13:22+05:30 IST
తెలంగాణలోని జైళ్లలో ఖైదీల ములాఖత్లను జైళ్ల శాఖ నిలిపివేసింది. శుక్రవారం నుంచి ములాఖత్లను అధికారులు నిలిపివేయనున్నారు. కరోనా..
హైదరాబాద్: తెలంగాణలోని జైళ్లలో ఖైదీల ములాఖత్లను జైళ్ల శాఖ నిలిపివేసింది. శుక్రవారం నుంచి ములాఖత్లను అధికారులు నిలిపివేయనున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జైళ్ల శాఖ అధికారులు నిర్ణయించారు. ఖైదీల ములాఖత్ల కోసం ఎవరూ హైదరాబాద్ రావొద్దని స్పష్టం చేసింది.