ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-05-30T14:47:48+05:30 IST

సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

అమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ ఉద్యోగి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. గత రెండ్రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు వివరాలు తెలియజేస్తూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమాచారం చేరవేశారు.

Updated Date - 2020-05-30T14:47:48+05:30 IST