వలస కూలీలకు కరోనా కాటు!

ABN , First Publish Date - 2020-04-09T11:31:29+05:30 IST

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీల పరిస్థితి దారుణంగా వుంది. డక్కిలి మండలం డి వడ్డిపల్లి, దేవులపల్లి, సంగనపల్లికి

వలస కూలీలకు కరోనా కాటు!

డక్కిలి, ఏప్రిల్‌ 8 :  వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీల పరిస్థితి దారుణంగా వుంది. డక్కిలి మండలం డి వడ్డిపల్లి, దేవులపల్లి, సంగనపల్లికి చెందిన వందలాది కుటుంబాలు  బేల్దారి పనుల నిమిత్తం చెన్నైకి వెళ్లి అక్కడ చిక్కుపోయాయి.  లాక్‌డౌన్‌ కారణంగా సొంతూరికి రా లేక కష్టాలు పడుతున్నాయి.


నెల రోజులుగా పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు,  బంధువులతో వాపోతున్నారు.   ఎక్కడి వారు అక్కడే ఉండాలన్న నిబంధనే వీరికి కొత్త కష్టాలు తీసుకొచ్చింది, వీరి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు ఆంధ్రాలోనే ఉండడంతో అక్కడి ప్రభుత్వం  చేసే సాయానికి వీరు  నోచుకోలేక పోతున్నారు. సుమారు నాలుగైదు వందల కుటుం బాలు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం

Updated Date - 2020-04-09T11:31:29+05:30 IST