గ్రామాల్లో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-05-17T04:55:55+05:30 IST

మామిడిపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న చిన్న గిరిజన గ్రామం గుడ్డంగివానివలసలో కరోనా కోరలు చాచింది. ఈ గ్రామంలో 32 కుటుంబాలుండగా వారిలో 37 మందిని కరోనా బాధితులుగా గుర్తించారు. గ్రామంలో 32 ఇళ్లలో 124 మంది నివశిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలో 67 మందికి కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

గ్రామాల్లో కరోనా విజృంభణ
జాగ్రత్తలను వివరిస్తున్న పోలీసులు

గిరిజన పల్లెలో 32 ఇళ్లకు 37 మందికి కరోనా

సాలూరు రూరల్‌, మే 16: మామిడిపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న చిన్న గిరిజన గ్రామం గుడ్డంగివానివలసలో కరోనా కోరలు చాచింది. ఈ గ్రామంలో 32 కుటుంబాలుండగా వారిలో 37 మందిని కరోనా బాధితులుగా గుర్తించారు. గ్రామంలో 32 ఇళ్లలో 124 మంది నివశిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలో 67 మందికి  కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో తొలుత 31 మంది బాధితులుగా గుర్తించారు. మళ్లీ మరో 15 మందికి  పరీక్షలను నిర్వహించగా మరో ఆరుగురు కరోనా బాధితులుగా గుర్తించారు. చిన్న గ్రామంలో ఏకంగా 37 మంది బాధితులుండడంతో మండలంలో ఈ సమాచారం సంచలనమైంది. బాధితుల్లో 33 మందిని మూడు 108 వాహనాల్లో రెండు దఫాలుగా బొబ్బిలి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు ఆదివారం తరలించారు. మరో ముగ్గురు ఇంటి వద్ద చికిత్సకు అనుమతించారు. ఒక బాధితుడు మాత్రం తెల్లవారుజాము నుంచి ఆచూకీ లభించకపోవడంతో అతని గురించి వైద్యసిబ్బంది ఆరా తీస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించినట్టు ఈవోపీఆర్డీ కె.కుమార్‌వర్మ చెప్పారు. సాలూరు రూరల్‌ పోలీసులు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  


Updated Date - 2021-05-17T04:55:55+05:30 IST