సమష్టి కృషి, సహకారంతోనే కరోనా కట్టడి
ABN , First Publish Date - 2021-04-20T05:36:54+05:30 IST
:సమష్టి కృషి, సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి అన్నారు.
- జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 19 :సమష్టి కృషి, సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి అన్నారు. బల్దియా కార్యాలయ ఆవర ణలో సోమవారం శానిటైజర్ స్ర్పే చేసే వాహనాలను చైర్ పర్సన్ శ్రావణి ప్రారంభించి పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో స్ర్పే చేసి మాట్లాడారు. కరోనా కేసులు పెరుగు తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్, కమిషనర్ మారు తీ ప్రసాద్, కౌన్సిలర్లు కూతురు రాజేష్, నక్క జీవన్, శాని టరీ ఇన్స్పెక్టర్లు అశోక్, రాము, విజయ్ ఉన్నారు.