ప్రాణాలమీదకి తెచ్చిన కరోనా జాగ్రత్త
ABN , First Publish Date - 2020-04-08T09:05:49+05:30 IST
ఉమ్మెత్త కాయలను నూరి నీటిలో కలిపి తాగితే కరోనా రాదని ఎవరో చెప్పడంతో ఓ కుటుంబం గుడ్డిగా నమ్మేసింది.
ఉమ్మెత్తకాయల రసం తాగడంతో కుటుంబం ఆసుపత్రిపాలు
బైరెడ్డిపల్లె(చిత్తూరు), ఏప్రిల్ 7: ఉమ్మెత్త కాయలను నూరి నీటిలో కలిపి తాగితే కరోనా రాదని ఎవరో చెప్పడంతో ఓ కుటుంబం గుడ్డిగా నమ్మేసింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం ఎ.కొత్తూరుకు చెందిన వ్యవసాయకూలీ నాగరాజు(50)కు ఉమ్మెత్త కాయల ద్రావణం కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందని ఎవరో చెప్పారు.
దీంతో ఆయన మంగళవారం ఆ కాయలను సేకరించి నూరి నీటిలో కలిపి తాను తాగడమే కాకుండా కుటుంబంలోని లక్ష్మమ్మ(45), సుధాకర్(25), గీత(20), భవాని(20), వెంకటమ్మ(70), హేమంత్(6), వెంకటేశ్(9)లకు ఇచ్చాడు. తాగిన కొద్ది సేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బైరెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.