మరో 73 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-04T06:07:51+05:30 IST
జిల్లాలో గురువారం 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో 58,873కు చేరిన పాజిటివ్లు
విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 58,873కు చేరాయి. వీరిలో 57,812 మంది వైరస్ నుంచి కోలుకోగా, 549 మంది చికిత్స పొందుతున్నారు. కాగా గురువారం ఒకరు మృతి చెందడంతో జిల్లాలో కొవిడ్ మరణాలు 512కు చేరాయి.
మన్యంలో ఒకటి...: పాడేరు ఏజెన్సీలో గురువారం 503 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా హుకుంపేట మండలంలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఏడీఎంహెచ్వో డాక్టర్ కె.లీలాప్రసాద్ తెలిపారు.